19
మళ్లీ వైసీపీకే ఛాన్స్
విజయనగరం స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి నిలబెట్టుకోవాలని భావిస్తున్నది. ఈ స్థానానికి తాజాగా భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎన్నికల కోడ్ ఇప్పటికే అమల్లోకి రావడంతో గజపతినగరంలో సీఎం చంద్రబాబు నాయుడు అధికారిక పర్యటన సైతం రద్దైంది. రెండున్నరేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ మొత్తం 34 జడ్పీటీసీ స్థానాలు, 389 స్థానాలకు గానూ 389 స్థానాల్లో విజయం సాధించారు. ఈసారి ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు మాజీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుతో విభేదాలు రావడంతో ఆయన పేరు వైసీపీకి వచ్చే అవకాశం ఉంది.