Tuesday, February 17, 2026
Home » కృష్ణా నది వరద ఉద్ధృతికి రాయపూడి పెదలంకలో కొట్టుకుపోయిన 300 గేదెలు

కృష్ణా నది వరద ఉద్ధృతికి రాయపూడి పెదలంకలో కొట్టుకుపోయిన 300 గేదెలు

0 comment

గుంటూరు జిల్లా తూళ్లూరు మండలంలోని కృష్ణా నది సమీపంలో లంక గ్రామాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. రాయపూడి పెదలంకలో సుమారు 300 పాడి గేదెలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. సుమారు 300 మంది గ్రామస్థులను సమీపంలోని ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పునరావాస కేంద్రానికి తరలించారు. ఇంకా సుమారు 70 మంది బాధితులు పెదలంకలోనే ఉన్నారు. హెలికాప్టర్ల ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch