7
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం అర్హతలు
- అభ్యర్థులు జనరల్(ఈడబ్ల్యూఎస్ కోటా)/బీసీ/ఎస్సీ/ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారై ఉండాలి.
- అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర శాశ్వత నివాసి అయ్యి ఉండాలి.
- యూపీఎస్సీ నిర్వహించిన ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణత సాధించాలి.
- వార్షిక కుటుంబ ఆదాయం రూ.8 లక్షల లోపు మాత్రమే ఉండాలి.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల శాశ్వత ఉద్యోగులు అనర్హులు
- గతంలో ఈ పథకం ద్వారా ప్రయోజనం పొంది ఉండకూడదు.
- అభ్యర్థులు వారి ప్రయత్నంలో ఒకే ఒకసారి ఈ ఆర్థిక ప్రోత్సహ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు.
దేశ వ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు దాదాపుగా 14 లక్షల మంది రాస్తున్నట్లు అంచనా. ప్రతి వేల తెలంగాణ నుంచి సుమారు 50 మంది సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షకు దరఖాస్తులు. వీరిలో సుమారుగా 400 నుంచి 500 వరకు ప్రిలిమ్స్లో అర్హత సాధిస్తున్నారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ద్వారా అర్హులైన సివిల్స్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం అందించనుంది.