10
- లారీని ఢీకొన్న కారు
- చిన్నారి సహా ఆరుగురి దుర్మరణం
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా ళ్తున్న ఓ కారు అదుపు తప్పిన లారీని ఢీకొనడంతో ఓ చిన్నారి సహా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఓ కుటుంబం విజయవాడ నుంచి రాజమండ్రికి కారులో బయలుదేరింది. నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారందరూ ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్మార్టమ్కు తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని సూచిస్తుంది.