28
జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ బిలియనీర్ల క్లబ్లో చేరారు. ఈరోజు ట్రేడింగ్లో జొమాటో షేర్లు 2%కుపైగా వృద్ధిని నమోదు చేయడంతో ఆయన నికర సంపద 1 బిలియన్ ₹8,300కోట్లు దాటింది. 2023 జులై నుంచి జొమాటో షేర్ల విలువ దాదాపు 300% పెరిగింది. కాగా గోయల్కు సంస్థలో 36.95 కోట్ల షేర్లు (4.24 శాతం వాటా) ఉన్నాయి. జొమాటోకు మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ వృద్ధి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.