Wednesday, April 2, 2025
Home » నైజీరియాలో వరుస బాంబుదాడులు.. 18 మంది దుర్మరణం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

నైజీరియాలో వరుస బాంబుదాడులు.. 18 మంది దుర్మరణం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 నైజీరియాలో వరుస బాంబుదాడులు.. 18 మంది దుర్మరణం - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



నైజీరియా: నైజీరియా దేశంలో జరిగిన వరుస బాంబు దాడుల్లో సుమారు 18 మంది మృతి చెందగా, మరో 48 మంది గాయపడ్డారు. మొదట ఒక వివాహ వేడుకలో, తర్వాత గ్వోజాలోని ఒక ఆసుపత్రిలో, మూడో బాంబ్ ఒక అంత్యక్రియల ప్రదేశంలో జరిగింది. నైజీరియాలోని ఉత్తర బోర్నో రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక వివాహ వేడుకలో జరిగింది. ఈ పేలుడు తర్వాత వరుసగా మరో రెండు పేలుళ్లు సంభవించాయి. బోర్నో స్టేట్ ఎమర్జెన్సీ మేనేజిమెంట్ ఏజెన్సీ (సెమా) డైరెక్టర్ బర్కిండో ముహ్మమ్మద్ సైదు సంతాననా ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చనిపోయిన వారిలో చాలామంది మహిళలు, పిల్లలు ఉన్నారని ఆయన చెప్పారు. అంతకుమించి వివరాలేమీ ఇవ్వలేదు. అంతకుముందు జూన్ 25న టెర్రరిస్టుల గ్రూప్ దాడిలో 21 మంది నైజీరియన్ సైనికులు మృతి చెందారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch