Tuesday, March 24, 2026
Home » ప్రారంభం రోజునే ఇవ్వాలనుకున్నాం.. కానీ కుదరలేదు – News Watch

ప్రారంభం రోజునే ఇవ్వాలనుకున్నాం.. కానీ కుదరలేదు – News Watch

by News Watch
0 comment
ప్రారంభం రోజునే ఇవ్వాలనుకున్నాం.. కానీ కుదరలేదు


  • ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఎప్పుడు ఇవ్వాలంటే వచ్చే నెలలో చెబుతాం
  • లక్షలాది దరఖాస్తులు వచ్చాయి
  • అర్హులను గుర్తించేందుకు కొంత ఆలస్యం
  • ఇప్పుడు మండలానికి ఒక గ్రామం ఫైలట్ ప్రాజెక్టు
  • సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి ప్రెస్ మీట్

ముద్ర, తెలంగాణ బ్యూరో :- నేటి నుంచి నాలుగు సంక్షేమ పథకాలను లాంఛనంగా ప్రారంభించబోతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల పథకాలను నేటి నుంచి అమలు చేయబోతున్నామని తెలిపారు.

అయితే వాటి కోసం లక్షల్లో దరఖాస్తులు రావడం వల్ల ప్రారంభం రోజున ఇవ్వడం సాధ్యపడడం. అర్హులను గుర్తించేందుకు కొంత ఆలస్యమయ్యే అవకాశం. వచ్చే నెల (ఫిబ్రవరి)లో ఎప్పుడు ఇస్తామన్నారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఒక్కరు రైతు భరోసా, భూమిలేని నిరుపేద, 20 రోజులపాటు ఉపాధి హామీ పనికి వెళ్లిన వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి ఉదాత్త ఉన్నతమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం సంక్షేమ రాజ్యం అని అన్నారు. నిజంగా ఆదివారం రోజునే అర్హులైన వారకి అందించాలని అనుకున్నాను. కానీ కొత్తగా చాలా మంది దరఖాస్తులు పెట్టుకున్నారని….కాబట్టి ఇవ్వలేక పోతున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా భట్టి, పొంగులేటి అన్నారు.

The post ప్రారంభం రోజునే ఇవ్వాలనుకున్నాం.. కానీ కుదరలేదు appeared first on Mudra News.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch