Tuesday, March 31, 2026
Home » పుష్ప పరామర్శ – Mudra News – Sravya News

పుష్ప పరామర్శ – Mudra News – Sravya News

by News Watch
0 comment
పుష్ప పరామర్శ - Mudra News


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ మంగళవారం ఉదయం బేగంపేట కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. సంధ్య థియేటర్‌ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్‌ను పరామర్శించారు. అయితే పోలీసుల సూచనల ప్రకారం ముందుగా వారికి సమాచారం ఇచ్చి ఆయన ఆసుపత్రికి బయలుదేరి వెళ్ళారు. గత 35 రోజులుగా కిమ్స్‌ ఆసుపత్రిలోనే శ్రీతేజ్‌ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. పోలీసుల అనుమతితో అల్లు అర్జున్‌ కిమ్స్‌ ఆసుపత్రికి వచ్చారు.

ఈ కిమ్స్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా కిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. కాగా అల్లు అర్జున్‌కు హైదరాబాద్, రాంగోపాల్‌పేట పోలీసులు మరోసారి నోటీసులు అందించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించాలంటే ముందుగా తమకు సమాచారం అందించిన నోటీసుల్లో ప్రముఖులు. బాలుడిని చూసేందుకు ఎప్పుడు రావాలనుకున్నా.. ముందుగానే ఇన్ఫర్మేషన్ అందించారు, ఆ తర్వాత మాత్రమే అక్కడికి వెళ్లాలని సూచించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch