Monday, December 8, 2025
Home » గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. 43 మంది మృతి – ముద్ర న్యూస్ – Sravya News

గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. 43 మంది మృతి – ముద్ర న్యూస్ – Sravya News

by News Watch
0 comment
హమాస్ అతిపెద్ద కమాండ్ కంట్రోల్‌గా భావించే కమల్ అద్వాన్ ఆసుపత్రిపై దాడి 20 మంది హమాస్ ఫైటర్లు హతం మరికొందరిని బందీలుగా పట్టుకున్న ఐడీఎఫ్ బందీల్లో అక్టోబర్ 7 దాడి నాటి ఉగ్రవాదులు హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఉత్తర గాజాలోని హమాస్ చివరి కమాండ్ కంట్రోల్‌గా భావిస్తున్న కమల్ అద్వాన్‌ ఆసుపత్రిపై నిన్న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) భీకర దాడులు జరిపింది. అలాగే, జబాలియా, హోనస్, లాహియా ప్రాంతాల్లోనూ దాడులకు దిగింది. ఈ దాడుల్లో మొత్తంగా 43 మంది మృతి చెందారు. ఆసుపత్రిపై జరిగిన దాడిలో 20 మంది హమాస్ ఫైటర్లు హతమయ్యారు. అలాగే, వైద్యులు, వైద్య సిబ్బంది సహా 240 మందిని నిర్బంధించింది. బందీల్లో ఆసుపత్రి డైరెక్టర్ అబూ సాఫియా కూడా ఉన్నారు. బందీల కళ్లకు గంతలు కట్టి ఆసుపత్రి ప్రాంగణంలో కూర్చోబెట్టడంతోపాటు, ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న వారిని పెడరెక్కలు విరిచికట్టి అర్ధనగ్నంగా కూర్చోబెట్టిన వీడియోలు, ఫొటోలను స్థానిక మీడియా ప్రచురించింది. కాగా, హమాస్‌ అతిపెద్ద కమాండ్ కంట్రోల్ ఈ ఆసుపత్రిలోనే ఉందని, అక్కడి నుంచే ఇజ్రాయెల్‌పై దాడులకు వ్యూహరచన చేస్తున్నట్టు ఇజ్రాయెల్ ఆర్మీ అనుమానిస్తోంది. తాజాగా బందీలుగా పట్టుబడిన వారిలో ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న దాడిచేసిన ఉగ్రవాదులు కూడా ఉన్నారని, షకీద్ బెటాలియన్‌కు చెందిన హమాస్ ఫైటర్లు వీరిలో ఎక్కువమంది ఉన్నారని ఐడీఎఫ్ ప్రకటించింది. కాగా, ఆసుపత్రిలోని నిజమైన రోగులను చికిత్స కోసం సురక్షితంగా ఇండోనేషియా ఆసుపత్రికి తరలించినట్టు వివరించింది.






గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. 43 మంది మృతి – ముద్ర న్యూస్





















You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch