Wednesday, December 10, 2025
Home » ఎమ్మెల్యేకు బెదిరింపులు – 20 లక్షల డిమాండ్ లేకుంటే పిల్లలు అనాధలవుతారు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

ఎమ్మెల్యేకు బెదిరింపులు – 20 లక్షల డిమాండ్ లేకుంటే పిల్లలు అనాధలవుతారు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
ఎమ్మెల్యేకు బెదిరింపులు - 20 లక్షల డిమాండ్ లేకుంటే పిల్లలు అనాధలవుతారు - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • లండన్ కాల్, గుర్తించిన పోలీసులు, లుక్ అవుట్ నోటీస్ జారీ
  • కరీంనగర్ రూరల్ వైసీపీ వెంకటరమణ

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కి బెదిరింపు కాల్స్ రావడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యే కే బెదిరింపు కాల్స్ రావడంతో ప్రభుత్వం ఈ సమీక్ష సీరియస్ గా తీసుకుంది. గత సెప్టెంబర్ 28వ తేదీన +447886696497 నుండి వాట్సాప్ ఫోన్ కాల్ వచ్చినట్లు ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో నిందితుడు మాట్లాడుతూ తనకు 20 లక్షల రూపాయలు చెల్లించాలని లేనియెడల రాజకీయంగా అప్రతిష్టపాలు చేసి, గౌరవానికి భంగం కలిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

మా డిమాండ్ ఒప్పుకోకుంటే ఇద్దరు పిల్లలను అనాధలు అయ్యేలా చేస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 339/2024 , భారతీయ న్యాయ సంహింత 308, 351(3), (4) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు రంగారెడ్డి జిల్లా బోడుప్పల్ లోని భవాని నగర్ కి చెందిన యాస అఖిలేష్ రెడ్డి (33) గా పేర్కొన్నారు. ఇతడు ప్రస్తుతం లండన్ లో ఉంటున్నట్లు, అక్కడి నుండే బెదిరింపులకు గురైనట్లు, నిందితుడిపై బ్యూరో ఇమ్మిగ్రేషన్ ద్వారా అవుట్ లుక్ ఆఫ్ సర్కులర్ జారీ చేసినట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ తెలిపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch