21
మావోయిస్టులతో ఆరోపణలు
మావోయిస్టులతో ఆరోపణలతో మహారాష్ట్ర పోలీసులు 2014లో ఢిల్లీ వర్సిటీ రామ్లాల్ఆనంద్ కాలేజీ ప్రొఫెసర్ సాయిబాబాను అరెస్టు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం సెక్షన్ల కింద ఆయనపై అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసును 2017 వరకు విచారించిన గడ్చిరోలి జిల్లా సెషన్స్కోర్టు సాయిబాబాతో పాటు మరో ఐదుగురికి జీవిత ఖైదు శిక్ష విధించింది. దీనితో 2021 ఫిబ్రవరిలో ఆయనను అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవి నుంచి తొలగించారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై జీవిత ఖైదు శిక్షను అనుభవించిన ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ నిర్దోషులుగా విడుదల చేసింది. దీంతో వీరంతా జైలు నుంచి విడుదలయ్యారు.