Thursday, February 12, 2026
Home » దేవుడిపైన రాజకీయాలు చేయొద్దు.. లడ్డు వివాదంపై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు.. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

దేవుడిపైన రాజకీయాలు చేయొద్దు.. లడ్డు వివాదంపై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు.. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
దేవుడిపైన రాజకీయాలు చేయొద్దు.. లడ్డు వివాదంపై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు.. - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



తిరుమల లడ్డూ కల్తీపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అత్యున్నత న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్లపై జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం విచారణను చేపట్టింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం లడ్డూ కల్తీ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేసింది. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరింది. లడ్డూ వ్యవహారంపై సిట్ కొనసాగాలా? లేదా అని సహకరించింది ఎస్జీని సుప్రీం కోరింది.

కోట్ల మంది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారమని సుప్రీంకోర్టు. స్వతంత్ర విచారణ జరపాలా? లేదా? చెప్పాలని కేంద్రాన్ని అడిగింది. సిట్‌ను కొనసాగించాలో లేదో చెప్పాలని కూడా కోరింది. రెండో అభిప్రాయం తీసుకోకుండా సీఎం మీడియాతో మాట్లాడారని అన్నారు. అసలు ఎన్ని నెయ్యి ట్యాంకర్లు వాడుతున్న వివరాలను టీటీడీ న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. జూన్ నుంచి జులై వరకు నెయ్యి ట్యాంకర్లు ఎన్ని వాడారనేది టీటీడీ న్యాయస్థానానికి వివరించింది. అయితే లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనేదానికి ఆధారాలు ఉన్నాయని సర్వోన్నత న్యాయస్థానం టీటీడీ న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ విచారణను గురువారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లు …

లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యస్వామి(బీజేపీ), వైవీ సుబ్బారెడ్డి(వైఎస్సార్సీపీ), రచయిత విక్రమ్ సంపత్, పలువురు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. వీరు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి బి. గవాయ్, జస్టిస్ కె.వి.విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరిపారు. పిటిషన్లలో ప్రసాదం కల్తీపై వాస్తవాలు తేల్చాలన్న సుబ్రహ్మస్వామి, సుప్రీంకోర్టు పరిశీలనలో విచారణకు సిద్ధమైన న్యాయస్థానాన్ని పరిశీలించారు. ప్రసాదం కల్తీపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని వైవీ సుబ్బారెడ్డి పిటిషన్‌ వేసి, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేసింది. అన్ని పిటిషన్లను కలిపి సుప్రీంకోర్టు ఒకేసారి విచారించింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch