Tuesday, December 9, 2025
Home » ఆడి కారుతో ఢీకొట్టి పరారైన బీజేపీ నేత కుమారుడు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ఆడి కారుతో ఢీకొట్టి పరారైన బీజేపీ నేత కుమారుడు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
ఆడి కారుతో ఢీకొట్టి పరారైన బీజేపీ నేత కుమారుడు - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



తన ఆడి కారుతో నాగ్‌పూర్‌లోని రాందాస్‌పేట ప్రాంతంలో పలు వాహనాలను ఢీకొట్టిన మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే కుమారుడు పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రశేఖర్ బవాంకులే కుమారుడు సంకేత్ బవాంకులే సహా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

అరెస్ట్ అయిన అర్జున్ హవారే, రోణిత్ చింతన్వర్ ఇద్దరూ ప్రమాద సమయంలో మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఆడికారు ఫిర్యాదుదారు జితేంద్ర సొంకాంబలే కారును తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో ఢీకొట్టింది. ఆ తర్వాత ఓ మోపెడ్‌పై వెళ్తున్న మరో ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో వారు గాయపడ్డారు.

ప్రమాద సమయంలో కారులో సంకేత్ సహా మొత్తం ఐదుగురు ఉన్నారు. ఆ సమయంలో వారు ధరంపేటలోని ఓ బారు నుంచి తిరిగి వస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. సొంకాంబలే ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత బెయిలుపై వారిని విడిచిపెట్టారు. ఆ కారు తన కుమారుడి పేరుపైనే రిజిస్టర్ అయి ఉన్నట్టు బీజేపీ మహారాష్ట్ర చీప్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాత విచారణ చేపట్టి, నిందితులకు తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. చట్టం అందరికీ సమానమేనని, తాను ఏ పోలీసు అధికారితోనూ మాట్లాడలేదని చెప్పారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch