Thursday, December 11, 2025
Home » కేశవాపురం వెలుగు పల్లి గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణానికి కృషి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

కేశవాపురం వెలుగు పల్లి గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణానికి కృషి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
కేశవాపురం వెలుగు పల్లి గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణానికి కృషి - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • వర్షాల వల్ల వచ్చే వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  • నిండుకుండల్లా ఉన్న చెరువుల స్థితిగతులను అధికారులు పరిశీలించాలి
  • వరదల వల్ల దెబ్బతిన్న నివాసిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్

తుంగతుర్తి ముద్రణ:- గడచిన నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తుంగతుర్తిలోని పలుకుంటలు తెగిపోయాయని కొన్ని గ్రామాలకు వరదల కారణంగా నియోజకవర్గాల రాకపోకలు బంద్ అయ్యాయని మానాయకుంట వద్ద ఒక మహిళ వరదల కొట్టుకపోయి మృతి చెందిన సంఘటనలు చోటుచేసుకున్నాయని తుంగతుర్తి ఎమ్మెల్యేలు మందుల సామెల్ అన్నారు. బుధవారం తుంగతుర్తి మండలం కేశవాపురం గ్రామానికి సమీపంలో ప్రవహిస్తున్న కేశవాపురం బంధాన్ని పరిశీలించి మాట్లాడారు.

కేశవాపురం గ్రామ ఇతర గ్రామాలతో రాకపోకలు బంద్ అయ్యాయని సుమారు 1500 మంది ఆ గ్రామంలో చిక్కుకుపోయారని అన్నారు. ఆ గ్రామస్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. వెలుగుపల్లి నుండి కేశవాపురం గ్రామానికి వెళ్లే రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మాత్యులు ఉత్తంకుమార్ రెడ్డిలకు తాను విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. తాను గతంలోనే ప్రతిపాదనలు కూడా పంపానని వాటిని పరిశీలించి బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. గత పాలకుల నిర్లక్ష్యం మూలంగానే కేశవాపురం గ్రామానికి తీవ్ర ఇబ్బందులు కలిగాయని అన్నారు. అదేవిధంగాఅరవపెళ్లి గ్రామంలో రెసిడెన్షియల్ పాఠశాలలను చెరువులో నిర్మించడం వల్ల పాఠశాలలోకి నీరు వచ్చి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.

మానాయకుంట వరదల ఒక మహిళ కొట్టుకుపోయి మృతి చెందిందని ఇది విచారకరమని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రజలు కురుస్తున్న వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సైతం వరద పరిస్థితిని పరిశీలించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రమాద భరితమైన చెరువులను కుంటలను గమనించి లోతట్టు ప్రాంతంలో గ్రామాలు ఉన్న గ్రామాల ప్రజలకు రక్షణ కల్పించాలని సూచించారు. ప్రజలు భారీ ప్రవాహాల గుండా తాగవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్ కంట్లమయ్య ,పిసిసి సభ్యురాలు గుడిపాటి నరసయ్య ,మండల పార్టీ అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్ ,జిల్లా కాంగ్రెస్ తిరుమల నాయకులు ప్రగడ కిషన్ రావు ,సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సాయి,లతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch